నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఘనంగా బోనాలు

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఘనంగా బోనాలు

కామారెడ్డిటౌన్/సిరికొండ/సదాశివనగర్/ధర్పల్లి​, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాజాభజంత్రీలతో మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించగా, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి మండలంలోని పాతరాజంపేట,  టెకిర్యాల్​, ఉగ్రవాయి గ్రామాల్లో పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ బోనాల పండుగ జరిగింది.

పాతరాజంపేటలో ఉత్సవాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొని పూజలు చేశారు.  సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్, సిరికొండ పలు గ్రామాల్లో పోచమ్మ పండగ ఘనంగా నిర్వహిచారు.  సదాశివనగర్​ మండలంలోని వజ్జపల్లి గ్రామలో పోచమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు.  ధర్పల్లిలో పోచమ్మ పండుగ ఘనంగా జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.