
- అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ఆర్బీఐ గవర్నర్
- రూపాయి విలువ తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించారు
- ఫైనాన్షియల్ మార్కెట్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు: మాజీ ఆర్బీఐ గవర్నర్లు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టైమ్లో రూపాయి వాల్యూని తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకిటరమణన్ (92) శనివారం తుది శ్వాస విడిచారు. తన మూడు దశాబ్దాల ఐఏఎస్ కెరీర్లో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు. వెంకిటరమణన్ డిసెంబర్ 1990 – డిసెంబర్ 1992 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పని చేశారు. ఈ టైమ్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ వరస్ట్ క్రైసిస్ను ఎదుర్కొంది. ఆయిల్ కొనుక్కునే స్థాయిలో కూడా లేదు.
మన రూపాయికి వాల్యూ పడిపోవడంతో గోల్డ్ను తనఖా పెట్టి వివిధ దేశాల నుంచి ఫండ్స్ సేకరించాల్సి వచ్చింది. ఈ టైమ్లోనే పీవీ నరసింహ రావు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఎకానమీని లిబరలైజ్ చేసింది. ప్రభుత్వం రిస్ట్రిక్షన్ల తగ్గించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహించింది. వెంకిటరమణన్ నాయకత్వంలోని ఆర్బీఐ రూపాయి విలువను తగ్గించి ఎక్స్పోర్టింగ్ కంపెనీలను ప్రోత్సహించింది. ఇంపోర్ట్స్ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. ‘పరిస్థితులు అధ్వానంగా మారాయి.
సమస్యలను పరిష్కరించేందుకు గవర్నర్ వెంకిటరమణన్కు, నాకు క్లియరెన్స్ వచ్చాయి’ అని వెంకిటరమణన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్గా మారిన సీ రంగరాజన్ పేర్కొన్నారు. రూపాయి వాల్యూ తగ్గడంతో ఎక్స్టర్నల్ ప్రెజర్స్ తగ్గాయని, ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్లలో లిబరలైజేషన్ పాలసీలు వచ్చాయని వెల్లడించారు. లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (ఎల్ఈఆర్ఎంఎస్) తీసుకొచ్చామని చెప్పారు.
డిజాస్టర్ ఎదుర్కొనేందుకు సీక్రెట్గా రెడీ
‘డీఫాల్ట్ అవుతామని (అప్పులు తీర్చలేకపోవడం) ఆలోచించడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. కానీ, గవర్నర్ వెంకిటరమణన్ మాత్రం డిజాస్టర్ను మేనేజ్ చేయడానికి రెడీగా ఉండాలని ఆర్డర్స్ ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై టెక్నికల్ వర్క్ చేపట్టాలని ఆదేశించారు. ఆర్బీఐ దీనిని సీక్రెట్గా చేపట్టింది. ఒక వేళ పరిస్థితులు వరెస్ట్గా మారినా ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పొచ్చు’ అని మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ గురించి చర్చలు జరుగుతున్న టైమ్లో క్యాపిటల్ గూడ్స్ దిగుమతులకు పర్మిషన్స్ ఇవ్వడంలో వెంకిటరమణన్ జాగ్రత్తగా వ్యవహరించారు. యూఎస్ డాలర్కు డిమాండ్ భారీగా పెరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఫైనాన్షియల్ సెక్టార్లో అనేక సంస్కరణలు ఆయన టైమ్లోనే వచ్చాయి. బ్యాంకులు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రవేశపెట్టాయి. ఐడీబీఐ, నాబార్డ్ తమ సర్వీస్లను విస్తరించాయి. మొదటిసారిగా ఆర్బీఐ సపోర్ట్ లేకుండా 364 రోజుల ట్రెజరీ బిల్స్ వేలం జరిగింది. అతి పెద్ద స్టాక్మార్కెట్ స్కామ్ 1992లో జరిగింది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా, ఇతరులు గవర్నమెంట్ బాండ్ మార్కెట్లను, బ్యాంకుల నుంచి ఫండ్స్ సేకరించి షేర్ల ధరలను మానిప్యులేట్ చేశారు. ఈ టైమ్లో వెంకిటరమణన్ ఆర్బీఐ గవర్నర్గా పని చేశారు.
చాలా మంది టాప్ బ్యాంకర్లను అరెస్ట్ చేశారు. బాండ్ మార్కెట్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ టైమ్లో ఆర్బీఐ గవర్నర్ వెంకిటరమణన్, సెబీ హెడ్ జీవీ రామకృష్ణ మధ్య బేదాధాభిప్రాయాలు ఉన్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు. వీరు కలవడానికి ఇష్టపడలేదని అన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ గురించి డిస్కస్ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ చైర్మన్షిప్లో ఓ కమిటీ ఏర్పాటయ్యిందని అన్నారు. అప్పుడు రెడ్డి సెబీ మెంబర్గా పనిచేస్తున్నారు. ‘ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ను మేనేజ్ చేయడంలో అసాధారణమైన నాయకత్వాన్ని చూపిన వారిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకిటరమణన్ టాప్లో ఉంటారు’ అని ఆయన అన్నారు.