విషాదంగా విహారయాత్ర... -గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

విషాదంగా విహారయాత్ర... -గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

 యానం విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు గౌతమి గోదావరిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన హనుమకొండ కార్తీక్ అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చేందుకు తన స్నేహితులైన సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య, మద్దిన ఫణీంద్ర గణేష్, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రాంతేజ, నేదూరి భానుప్రసాద్ తో కలిసి యానాం వచ్చారు. యానాంలో సరదాగా గడిపిన వారు అనంతరం తిరిగి వెళుతూ తాళ్లరేవు మండలం గోపులంక పుష్కరఘాట్ వద్ద స్నానం చేసేందుకు దిగే ప్రయత్నం చేసారు. 

 కార్తీక్ గోదావరిలోకి దిగి స్నానం చేస్తూ మునిగిపోతుండగా మిగిలిన వారు కాపాడే ప్రయత్నం చేసారు. వీరిలో నలుగురు గల్లంతవగా మిగిలిన ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు.  పెండ్యాల బాలాజి, తిరుమల రవితేజ, ముద్దన ఫణీంద్ర గణేష్ తోపాటు హనమకొండ కార్తీక్ లు నదిలో మునిగిపోయి గల్లంతయ్యారు. కోరంగి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.