ఆసిఫాబాద్: పోడుకు సహకరించిన ఎఫ్ఎస్వో సస్పెన్షన్

ఆసిఫాబాద్: పోడుకు సహకరించిన ఎఫ్ఎస్వో సస్పెన్షన్

ఆసిఫాబాద్, వెలుగు: పోడు భూములు సాగు చేసేందుకు రైతులకు సహకరించిన ఖర్జెల్లి ఫారెస్ట్​ సెక్షన్  ఆఫీసర్(ఎఫ్ఎస్​వో) అజ్మీరా మోహన్ ను సస్పెండ్  చేస్తూ డీఎఫ్​వో నీరజ్ కుమార్  టిబ్రెవాల్  శనివారం (June 14) ఉత్తర్వులు జారీ చేశారు. చింతలమానేపల్లి మండలం ఖర్జెల్లి సెక్షన్  పరిధిలోని దిందా, బండేపల్లి శివారులో భారీగా అడవులను నరికి పోడు సాగు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో 15 రోజులుగా రీ ట్రైవ్  కోసం అటవీ అధికారులు ప్రయత్నం చేస్తుండగా, పోడు రైతులు అడ్డుకుంటున్నారు. పలుమార్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా పోడు రైతులకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ 
చేశారు.