
- ఒకరికి స్వల్ప గాయాలు
శంషాబాద్, వెలుగు: గ్యాస్సిలిండర్రెగ్యులేటర్పైప్డ్యామేజ్అయింది. అయినా దాన్ని మార్చకుండా స్టిక్కర్వేసి, వాడుకుంటున్నారు.. వంట చేస్తుండగా గ్యాస్లీకై, అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధి పద్మశాలీపురం టీఎన్జీవోస్ సొసైటీ సాయి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కాలనీ ఫ్లాట్నంబర్871లో ఉంటున్న చెన్నమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో వంట చేస్తోంది.
సిలిండర్ పైప్లీకై, ఒక్కసారిగా మంటలు రావడంతో ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. స్థానికుడైన బాలరాజు ఓ సంచిని నీటిలో తడిపి, ఆ సిలిండర్ కు చుట్టి బయటకు తీసుకువచ్చి, మంటలు ఆర్పివేశాడు. ఈ ప్రయత్నంలో అతను స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్సిబ్బంది ఇంట్లో కిటికీలు, టీవీ, ఇతర సామగ్రికి అంటుకున్న మంటలను ఆర్పారు. రెగ్యులేటర్ పైప్ డ్యామేజ్అయినా మార్చకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.