
కోల్బెల్ట్/చెన్నూర్/జైపూర్, వెలుగు: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర మైనింగ్ అండ్ లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మాల సంఘం బాధ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం, జైపూర్, భీమారం, చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రిలో ర్యాలీలో పాల్గొన్నారు.
చెన్నూరు క్యాంప్ఆఫీస్లో సీనియర్కాంగ్రెస్ లీడర్ హేమంత్ రెడ్డి–శకుంతల దంపతులు మంత్రికి వెండి కిరీటాన్ని ధరింపజేసి సన్మానించారు. అంతకు ముందు మంత్రికి కాంగ్రెస్ నేతలు, అభిమానులు నాగలి అందించారు. ఈ సందర్భంగా మంత్రి సింగరేణి కార్మికుడి తరహాలో టోపీ, చెమ్మాస్ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. చెన్నూర్ నుంచి రామకృష్ణాపూర్ వెళ్తున్న మంత్రికి నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఆర్కే 6 మైన్ వద్ద కాంగ్రెస్ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. మందమర్రిలో కాంగ్రెస్ కార్యకర్త రాచర్ల గణేశ్ ఆధ్వర్యంలో మంత్రికి నిలువెత్తు బెల్లాన్ని తులాభారం వేశారు.
పోలీసుల గౌరవ వందనం
చెన్నూరు క్యాంపు ఆఫీస్కు చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి హోదాలో తొలిసారిగా రావడంతో జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి భారీ పోలీస్ బందోబస్త్ కల్పించారు. వివిధ హోదాల్లోని పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వ శాఖల అధికా రులు మంత్రిని కలిసి బొకేలు అందజేసి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.