
గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్రంలో రూ. 154 కోట్లతో మరో 900 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలి కొండాపూర్ లో గల జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన థర్డ్ ఫ్లోర్ను హరీశ్, మంత్రి సబితా రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎస్ఐఆర్లో భాగంగా మైండ్స్పేస్రహేజా కంపెనీ సహకారంతో100 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. కొండాపూర్ ఆసుపత్రికి డయాలసిస్ యూనిట్ తెస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.154 కోట్లతో 900 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, టీకా వేయించుకోని వారు త్వరగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఎస్సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు, రహేజా సంస్థ ప్రతినిధులు, డాక్టర్లు పాల్గొన్నారు.