
తిరుపతి, తిరుమలలో నాలుగు రోజుల నుంచి ( అక్టోబర్ 19 నాటికి) కురస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడటతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమలలో ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్డులో 9 వ కిలోమీటర్ కొండచరియలు విరిగిపడ్డాయి. జారిపడిన కొండ చరియలను టిటిడి సిబ్బంది తొలగించారు. బండ రాళ్లు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొండ చరియలను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు.