చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని చెప్పింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఏపీ తీరం మీదుగా పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో గరిష్ఠంగా 65 నుంచి -85 కి.మీ స్పీడ్తో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్టీంలను అలర్ట్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎస్వి ఇరాయ్ అన్బు సీనియర్ ఆఫీసర్లతో సమావేశమై తుఫాన్ ఎఫెక్ట్పై సమీక్షించారు. పుదుచ్చేరి, కారైక్కాల్లో శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. సబర్బన్ సర్వీసులతో సహా కొన్ని రైళ్లు నడిచాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి కూడా రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.