వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్

వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్

రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పట్టణంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాహనాలతో వేములవాడ నుంచి కరీంనగర్ , హైదరాబాద్ వెళ్లే మార్గాలు నిండిపోయాయి. సిరిసిల్ల నుంచి వేములవాడకు వచ్చే దారిలో ఎక్కడికక్కడ వాహనాలు స్ట్రక్ అయిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వేములవాడకు భక్తులు పోటెత్తారు.  శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు..ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో  భక్తుల వాహనాలతో వేములవాడలోని అన్ని మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

భక్తుల వాహనాలతో వేములవాడ  మూలవాగు వంతెన పై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి భక్తులు ట్రాఫిక్ లోనే ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు. ఇక వేములవాడ రాజన్న ఆలయం దగ్గర అయితే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. గుడి దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు.