రెంట్​ కట్టలేదని హాస్టల్​కు తాళం

రెంట్​ కట్టలేదని హాస్టల్​కు తాళం

భైంసా, వెలుగు: బిల్డింగ్​ రెంట్ కట్టకపోవడంతో స్టూడెంట్లు లోపల ఉండగానే ప్రైవేట్​ స్కూల్​హాస్టల్​కు ఓనర్​ తాళం వేశాడు. భైంసాలోని వాసవి గురుకులం స్కూల్​ యాజమాన్యం రెంట్​ చెల్లించలేదంటూ​భవన యజమాని ఆదివారం రాత్రి 8 గంటలకు హాస్టల్​కు తాళం వేశాడు. హాస్టల్​లో దాదాపు 70 మంది చిక్కుకోగా అందులో 25 మంది టెన్త్​ స్టూడెంట్లు ఉన్నారు. తెల్లారితే పరీక్ష ఉండడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. స్కూల్​ యాజమాన్యం నాలుగు నెలల అద్దె రూ. 85 వేల వరకు చెల్లించాల్సి ఉందని, డబ్బులు కడితేనే తాళం తీస్తానని ఓనర్​ చెప్పాడు. టీచర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. తాళం వేసిన విషయాన్ని స్టూడెంట్లు పేరెంట్స్​కు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎంఈవో బిల్డింగ్​ ఓనర్​తో చర్చించారు. అద్దె చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 10.30 గంటల సమయంలో తాళం తీశాడు.