బోధన్, వెలుగు : బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన భార్య తూము పద్మ 35వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తూము పద్మాశరత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్గా పని చేశారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గెలిపించిన కాలనీల వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డిలో...
కామారెడ్డిటౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా భార్యభర్తలు విజయం సాధించారు. వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 46వ వార్డు నుంచి భర్త గెరుగంటి లక్ష్మీనారాయణ, 47 నుంచి భార్య గెరుగంటి స్వప్న విజయం సాధించారు. గత కౌన్సిల్లో గెరుగంటి స్వప్న 47 వ వార్డు నుంచి కౌన్సిలర్గా కొనసాగారు. గెలిపించిన కాలనీల వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
