భార్యను చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

భార్యను చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

కొండపాక, వెలుగు : ఓ వ్యక్తి పారతో భార్య తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆదివారం వెలుగుచూసింది. కుక్కునూరుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండపాక గ్రామానికి చెందిన పొన్నాల మల్లేశం, యశోద (45) భార్యాభర్తలు. యశోదకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానించిన మల్లేశం తరచూ గొడవపడేవాడు. మల్లేశం అప్పుడప్పుడు ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోతుండడంతో మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసు సైతం నమోదు అయింది.

ఇటీవల తిరిగి రావడంతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే మల్లేశం శనివారం రాత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. బయటకు ఎందుకు వెళ్తున్నావని భార్యతో పాటు కూతుళ్లు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన మల్లేశంతో పారతో భార్యపై దాడి చేయడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు 108లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ ఆదివారం చనిపోయింది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.