హైదరాబాద్, వెలుగు: ఆగ్రో ఇండస్ట్రీస్కు సంబంధించిన దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. మౌలాలిలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కు చెందిన భూములను స్థానికులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
శుక్రవారం ఆగ్రోస్చైర్మన్ బాలరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, హైడ్రా సిబ్బంది డిమాలిషన్ చేసి 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా అధికారుల సహకారంతో ఆక్రమణలో తొలగించి మొత్తం 23 ఎకరాల 28 గుంటల భూమికి ఫెన్సింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్మేనేజ్యూనుస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
