
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర, మహబూబ్ నగర్ ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. మే 31 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2025–-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులు ఈ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
బాసర క్యాంపస్లో 1500 సీట్లు, మహబూబ్నగర్ క్యాంపస్లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జూన్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450, ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు www.rgukt.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.