జగిత్యాల వాసికి రూ.30 కోట్ల లాటరీ

జగిత్యాల వాసికి రూ.30 కోట్ల లాటరీ

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడికి అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రే 30 కోట్లకు యజమానిని చేసింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన ఓగుల దేవరాజం బతుకుదెరువు కోసం  నాలుగేళ్ల క్రితం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్కడ 15 దిర్హమ్స్‌ తో రెండు లాటరీ టికెట్లు కొన్నాడు.  డ్రాలో లాటరీ తీయగా అదృష్టం తననే వరించింది. 

ఓ టికెట్‌లో 1.50 కోట్ల దిర్హమ్స్‌ ను అజయ్ గెలుచుకున్నాడు. దీని విలువ  ఇండియన్  కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు. ఈ విషయాన్ని  అజయ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇప్పటికి తాను జాక్ పాట్ కొట్టినట్టుగా నమ్మలేకపోతున్నానని, వీటిలో కొంత కుటుంబానికి వెచ్చించి, మిగతా డబ్బుతో ఇండియాలో ఉంటూ వ్యాపారం చేస్తానని అజయ్‌ తెలిపారు.