రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్: రేపట్నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. గతంలో అంటే ఈనెల 10వ తేదీన ఇచ్చిన అల్టిమేటంకు కట్టుబడి సమ్మె ప్రారంభిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం  ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె నోటీసుకు స్పందించి స్టైఫండ్ పెంచుతున్నట్లు కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో విడుదలకు ఆదేశిస్తామన్నా ఇంత వరకు అమలులోకి  రాకపోవడంతో సమ్మె ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. లేనిపక్షంలో ఈనెల 27 నుంచి అన్ని విధులను బహిష్కరిస్తామని వారు ప్రకటించారు.