రంజిత్​ చెప్పిపోయిండో లేదో రామన్నకే తెలియాలి: కాలె యాదయ్య

రంజిత్​ చెప్పిపోయిండో లేదో రామన్నకే తెలియాలి: కాలె యాదయ్య
  • మాకు టైం ఇయ్యలే, ఆయనకు ఇచ్చిన్రు
  • కేటీఆర్​ ముందు యాదయ్య కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: రంజిత్​రెడ్డిని కేటీఆర్​ 24 గంటలు పక్కనే కూర్చోబెట్టుకున్నా ఆయన పార్టీ మారారని, ఆయన చెప్పి పోయిండో లేదో రామన్నకే తెలియాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 2014లో కొండా విశ్వేశ్వర్​రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గానికి ఏమీ చేయలేదని తెలిపారు. చేవెళ్ల సన్నాహక సమావేశంలో యాదయ్య మాట్లాడారు.  ‘రంజిత్​ రెడ్డిని ఎక్కడి నుంచి తెచ్చారో ఏమోగానీ మీరే పట్టుకొచ్చారు. 24 గంటలు మీ పక్కనే కూర్చునేటోడు. ఎవరినీ కలవని మీరు.. ఎవరికీ సమయం ఇవ్వని మీరు.. ఆయన్ను మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నరు. అట్లాంటి వ్యక్తి పార్టీ మారి కాంగ్రెస్​లో చేరారు. మళ్లా పార్టీలోకి వస్తాడా? రాడా? అన్న విషయం రామన్నకే తెలియాలి’ అని యాదయ్య వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్​ పార్టీని వీడనన్నారు.