
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి భూ సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఇల్చిపూర్లోని రెవెన్యూ సదస్సును పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జనార్ధన్
ఉన్నారు.
నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేసేలా కృషి చేయాలి
జిల్లా నుంచి మంచి క్వాలిటీ రైస్, మక్క, సోయాబిన్ ఎగుమతి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఎక్స్ఫోర్ట్ ప్రమోషన్ కమిటీ మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు.
ఎగుమతులు చేయటంతో జిల్లాకు మంచి గుర్తింపుతో పాటు, రైతులకు , వ్యాపారులకు లాభాలు వస్తాయన్నారు. ఇండస్ట్రీస్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. గత మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటంపై కలెక్టర్ అసంతృఫ్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ర్టీస్ అడిషనల్ డైరెక్డర్ జనరల్ ఆప్ ఫారిన్ ట్రేడ్ శైలజ, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్నాయక్, జిల్లా ఇండస్ర్టీస్ అధికారి లాలూనాయక్, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు పెండింగ్లో పెట్టొద్దు
బోధన్,వెలుగు : రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని నిజామాబాద్జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని చావిడి వద్ద రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో 13మంది రైతులు దరఖాస్తులు చేయగా, పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, శివాయం చైర్మన్ హరికాంత్చారి, మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి పాల్గొన్నారు.