
కామారెడ్డిటౌన్, వెలుగు : మహిళలు సాధికారికత సాధించాలంటే ఆర్థికంగా ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా మహిళా సాధికారిత కేంద్రం, సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ లో పాల్గొన్న మహిళలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పోటీ పోస్టర్ల అవిష్కరణ
నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ ( ఎన్ఎస్పీసీ) పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరు చేయడం వంటి పద్ధతులను విద్యార్థులకు అలవాటు చేయాలన్నారు. హరిత్, దవే ఆప్ లైఫ్ అనే నినాదాంతో పర్యావరణ సంరక్షణపై ఆగస్టు 21 వరకు ఆన్లైన్లో ఎంట్రీ చేసుకోవచ్చని, 5 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్నాయక్, డీఈవో రాజు, సైన్స్ అధికారి సిద్దారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎల్లారెడ్డి ఆర్డీవో
ఇటీవల ఎల్లారెడ్డి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన పార్థసింహారెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారంపై ఫోకస్ చేయాలని ఆర్డీవోకు కలెక్టర్ సూచించారు.