- కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డిలో అవినీతిని సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ మీటింగ్కు ఆయన బీజేపీ తరఫున గెలిచిన 16 మంది కౌన్సిలర్లను వెంట బెట్టుకొని వచ్చారు. చైర్పర్సన్ ఎన్నిక తర్వాత మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార మీటింగ్ల్లో తాను ముందే లోపాయి కారి ఒప్పందాలపై చెప్పానన్నారు. అదే విధంగా ఇప్పుడు జరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అవగాహనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారాజ్యంగా అధికారులు సంతకాలు చేస్తే సస్పెండ్ చేయిస్తామన్నారు. తమకు మున్సిపాలిటీలో 16 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
