కరీంనగర్ టౌన్, వెలుగు: తమిళనాడులో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు కరీంనగర్ శివారు బొమ్మకల్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ అవనిరెడ్డి ఎంపికైనట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 17 విభాగంలో అవనిరెడ్డి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్, హెచ్వోడీ మురళీధర్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
