V6 News

కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభం : ఎంపీ రఘునందన్ రావు

కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభం : ఎంపీ రఘునందన్ రావు

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్​ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్​రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్య​అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి,  మాల్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. పట్టు చీరలు, వెడ్డింగ్ శారీస్​, వింటేజ్​ కలెక్షన్స్​ను పరిశీలించి డిజైన్లు బాగున్నాయని, ధరలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ లో కిసాన్​ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడంతో పట్టణంతోపాటు పరిసర ప్రాంత వాసులు షాపింగ్​ కోసం హైదరాబాద్ వెళ్లే ఇబ్బంది తప్పిందన్నారు. 

షాపింగ్​మాల్​ఓనర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ మాట్లాడుతూ.. 66 ఏండ్లుగా తమ కుటుంబం వస్త్ర వ్యాపారం చేస్తోందన్నారు. తమ మాల్​ లో అన్ని వయసుల వారికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్​ చంద్రపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాంకర్​ అనసూయను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఈ సందర్భంగా పలు పాటలకు ఆమె స్టెప్పులు వేసి అలరించారు.