మణిపూర్​లో మళ్లీ హింస.. 9 మంది మృతి

మణిపూర్​లో మళ్లీ హింస..  9 మంది మృతి

ఇంఫాల్: మణిపూర్​ ఖమెన్లోక్​ ఏరియాలోని ఓ గ్రామంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. మరో పదిమంది గాయపడ్డారని అధికారులు బుధవారం తెలి పారు. ఇంఫాల్ ఈస్ట్​ జిల్లా కంగ్​పోకీ బోర్డర్​లో ఉన్న కుకీ గ్రామాన్ని సాయుధ దుండగులు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో చట్టుముట్టి కాల్పులు జరిపారు. గన్​ఫైర్​లో ఇరువర్గాలవారు గాయపడ్డారు. వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రంలోని 16 జిల్లాలకు గానూ 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఇప్పటి వరకు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల కర్ఫ్యూకు సడలింపు ఇవ్వగా.. తాజా ఘటనతో ఈ సమయాన్ని ఉదయం 5 నుంచి 9 గంటల వరకు అధికారులు కుదించారు. మణిపూర్​లోని మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 100 మందికిపైగా మరణించారని, 310 మందికిపైగా గాయపడ్డారని ఆ రాష్ట్ర ప్రభుత్వం​ వెల్లడించింది.