తల్లుల సేవలో గవర్నర్‌‌.. స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్

తల్లుల సేవలో గవర్నర్‌‌.. స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్

ములుగు/తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మను శుక్రవారం గవర్నర్​జిష్ణుదేవ్‌‌ వర్మ దర్శించుకున్నారు. హెలికాప్టర్‌‌ ద్వారా మేడారం చేరుకున్న ఆయనకు మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్​, డీజీపీ శివధర్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ దివాకర, ఎస్పీ సుధీర్‌‌ రాంనాథ్‌‌ కేకన్‌‌ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్‌‌ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పూజారులు డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో ఆహ్వానం పలికారు. గవర్నర్​తన సతీమణితో కలిసి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తులాభారం వేసి ఎత్తు బంగారం సమర్పించారు.