మీడియాపై మంత్రి నిరంజన్ రెడ్డి అసహనం

మీడియాపై  మంత్రి నిరంజన్ రెడ్డి అసహనం

నాగర్ కర్నూల్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి నిరంజన్ రెడ్డి. జెడ్పీటీసీలు.. తమకు సముచిత గౌరవం దక్కటం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ దూరంగా కూర్చున్నారు. దీంతో... మంత్రి నిరంజన్ రెడ్డి వారితో మాట్లాడుతూ సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నించింది. ఇది గమనించిన మంత్రి.. మీరేంటి ఇక్కడ.. మాకు ప్రైవసీ లేదా.. ఇక్కడి నుండి పక్కకు వెళ్ళండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను పంపించేయండి అని ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించారు. ప్రైవేసీ కోసం మీటింగ్ లు పబ్లిక్ గా పెట్టుకుంటారా... మీటింగ్ కు పిలిచి... తమపై ఇలా అసహనం వ్యక్తంచేయడం ఏంటి అని మీడియా సిబ్బంది అనుకున్నారు.