గుర్రపు స్వారీ చేస్తూ.. అనంత లోకాలకు మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్

గుర్రపు స్వారీ చేస్తూ.. అనంత లోకాలకు  మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్

మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ మరణించారు. ఏప్రిల్ 2న ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం మీది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యారు. మే 2వరకు సియెన్నా లైఫ్ సపోర్ట్ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె చనిపోయిందన్న విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు న్యూయార్క్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఆమె మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ సైతం సియెన్నా మరణాన్ని ధృవీకరించింది.

2022లో జరిగిన ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరు. సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యం,  మనస్తత్వశాస్త్రంలో ఆమె డబుల్ డిగ్రీ చేసింది. ఇక ఆమె మరణ వార్తను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కుటుంబసభ్యులు.. ‘‘ఎప్పటికీ మన హృదయాల్లో’’ అనే క్యాప్షన్ తో పలు ఫొటోలను పోస్టు చేశారు.

https://www.instagram.com/reel/Cr2Itk2BkLG/?utm_source=ig_embed&ig_rid=2ad4ac79-3707-44bf-8976-6fd12bc461b7