మెదక్ టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్ మండలంలోని జక్కన్నపేట పంపింగ్ స్టేషన్లో మోటార్లు చెడిపోవడం వల్ల మండలంలోని 32 గ్రామాలతో పాటు మెదక్ మండలంలోని 2 గ్రామాలకు తాగునీరు అందించడంలో అంతరాయం ఏర్పడుతోందని మిషన్ భగీరథ ఉమ్మడి మండలాల డీఈ పల్లవి తెలిపారు. శుక్రవారం ఆమె పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. మోటార్ల రిపేర్లకు సమయం పడుతున్నందున మూడు, నాలుగు రోజుల వరకు పంపింగ్నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బదులుగా ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ నుంచి తాగునీటి సరఫరా చేయడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆమె వెంట మిషనర్ భగీరథ ఏఈ రజిత, సిబ్బంది ఉన్నారు.
