
రాయపర్తి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అంతకుముందు వనమహోత్సవంలో భాగంగా మొక్కనాటి నీరుపోశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.