
బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఏఎంసీ చౌరస్తాలోని దివంగత మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 18వ వార్డులోని కాంట్రాక్టర్ బస్తీలో నివాసముండే కాంగ్రెస్ మైనారిటీ సీనియర్ నేత అన్వర్ ఖాన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అజ్మద్ తల్లి చోటమా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెను పరామర్శించారు. సీనియర్ నాయకులు మునిమంద రమేశ్, సూరిబాబు, బండి రాము, మల్లయ్య, జావేద్ ఖాన్, ఎండీ ఒజియార్ తదితరులున్నారు.