
వెలుగు, నెట్వర్క్: జాతీయ లోక్అదాలత్కు భారీ స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో ఏకంగా 12,652 కేసులు పరిష్కారమయ్యాయి. సుధీర్గ కాలంగా ఉన్న కేసుల పరిష్కారం లోక్అదాలత్తో సాధ్యమవుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్రావు అన్నారు.
డీఎల్ఎస్ఏ మీటింగ్ హాల్లో జాతీయ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న 2,963 కేసులను రాజీ మార్గం ద్వారం పరిష్కరించి, వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
మంచిర్యాల జిల్లాలో 5,250 కేసులు..
మంచిర్యాల జిల్లా కోర్టులో జరిగిన అదాలత్లో 5,250 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 37 బ్యాంక్ రికవరీ కేసులున్నాయి. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవాలని జిల్లా జడ్జి వీరయ్య కోరారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్కు మంచి స్పందన వచ్చింది.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనంత లక్ష్మి అదాలత్లో పాల్గొన్నారు. మొత్తం 1528 కేసులను రాజీ కుదిర్చి రూ. 32.27 లక్షల ఫైన్ విధించారు.
లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి
లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని ప్రజలు తమ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవా లని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్లో జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణితో కలిసి ఆమె పాల్గొన్నారు. 2911 కేసులు పరిష్కరిం చారు.
కేసులు ఏండ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉండటం వల్ల ప్రజలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వస్తే త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు.