లోక్ అదాలత్లో 12,652 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్లో 12,652 కేసులు పరిష్కారం

వెలుగు, నెట్​వర్క్: జాతీయ లోక్​అదాలత్​కు భారీ స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్​అదాలత్​లో ఏకంగా 12,652 కేసులు పరిష్కారమయ్యాయి. సుధీర్గ కాలంగా ఉన్న కేసుల పరిష్కారం లోక్​అదాలత్​తో సాధ్యమవుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్​జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్​రావు అన్నారు.

డీఎల్​ఎస్​ఏ మీటింగ్​ హాల్​లో జాతీయ అదాలత్​ను ఆయన ప్రారంభించారు. ఆయా పోలీస్​స్టేషన్ల పరిధిలో ఉన్న 2,963 కేసులను రాజీ మార్గం ద్వారం పరిష్కరించి, వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.  

మంచిర్యాల జిల్లాలో 5,250 కేసులు..

మంచిర్యాల జిల్లా కోర్టులో జరిగిన అదాలత్​లో 5,250 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 37 బ్యాంక్  రికవరీ కేసులున్నాయి. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవాలని  జిల్లా జడ్జి వీరయ్య కోరారు. ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్​కు మంచి స్పందన వచ్చింది.

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనంత లక్ష్మి అదాలత్​లో పాల్గొన్నారు. మొత్తం 1528 కేసులను రాజీ కుదిర్చి రూ. 32.27 లక్షల ఫైన్ విధించారు. 

లోక్ అదాలత్‌‌ ‌‌సేవలను వినియోగించుకోవాలి

లోక్ అదాలత్‌‌ ‌‌సేవలను వినియోగించుకుని ప్రజలు తమ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవా లని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్​లో జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణితో కలిసి ఆమె పాల్గొన్నారు. 2911 కేసులు పరిష్కరిం చారు. 

కేసులు ఏండ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్​లో ఉండటం వల్ల ప్రజలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్ అదాలత్‌‌ ‌‌ద్వారా ఇరు వర్గాలు రాజీకి వస్తే త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు.