నర్సంపేట, వెలుగు: పాఠశాలలు దేశ భవిష్యత్ కు మార్గదర్శకాలని జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సామాజిక కవి వళ్లంపట్ల నాగేశ్వర్ రావు అన్నారు. నర్సంపేట టౌన్ ఉదయశ్రీ హైస్కూల్లో 1993 - 2025 వరకు టెన్త్ బ్యాచ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ పాఠశాలల్లో నిర్మితమై ఉందన్నారు. పాఠశాలను కాపాడుకోవలసిన అవసరం అందరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీశ్వర్, ప్రముఖ న్యాయవాది మోటూరి రవి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
