
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామిని మంచిర్యాల జిల్లాలకు చెందిన కళాకారులు గురువారం సోమాజిగూడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్కు అభినందనలు తెలిపి సన్మానించారు. మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు ర్యాకం సంతోష్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్, సభ్యులు ఆర్.అర్జున్, ఎ.లక్ష్మణ్, ఎ.రమేశ్ బాబు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.