
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నషా ముక్త్ భారత్లో భాగంగా ఈనెల 26 వరకు మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్దులను కలుపుకొని స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ సేవలను పెంచాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని డీఅడిక్షన్ సెంటర్కు పంపాలన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్బీ, యాంటీ నార్కొటిక్ బ్యూరో జోన్ డీఎస్పీ సోమనాథం, డీఎంహెచ్వో రాజశ్రీ, డీఈవీవో రవికుమార్ పాల్గొన్నారు.
హార్టికల్చర్ సేవలు క్రీయాశీలం..
ఉద్యానవన శాఖ యంత్రాంగం జిల్లాలో తమ సేవలను పెంచాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం ఆ శాఖ ఆఫీసర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో పసుపు సాగు ఎక్కువ ఉన్నందున మేలు రకం విత్తనం పొందేలా చూడాలని, పసుపు రీసెర్చ్ సెంటర్, స్పైస్ పార్క్ సేవలు చేరువ చేయాలన్నారు. ఆయిల్ పామ్ విస్తరణకు స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులుఉన్నారు.