డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్​ టి.వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.  నషా ముక్త్​ భారత్​లో భాగంగా ఈనెల 26 వరకు మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్దులను కలుపుకొని స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్​లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ సేవలను పెంచాలన్నారు.  మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని డీఅడిక్షన్​ సెంటర్​కు పంపాలన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్​బీ, యాంటీ నార్కొటిక్ బ్యూరో జోన్​ డీఎస్పీ సోమనాథం, డీఎంహెచ్​వో రాజశ్రీ, డీఈవీవో రవికుమార్ పాల్గొన్నారు.

హార్టికల్చర్​ సేవలు క్రీయాశీలం..

ఉద్యానవన శాఖ యంత్రాంగం జిల్లాలో తమ సేవలను పెంచాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం ఆ శాఖ ఆఫీసర్లతో ఆయన మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలో పసుపు సాగు ఎక్కువ ఉన్నందున మేలు రకం విత్తనం పొందేలా చూడాలని, పసుపు రీసెర్చ్ సెంటర్​, స్పైస్​ పార్క్​ సేవలు చేరువ చేయాలన్నారు. ఆయిల్ పామ్​ విస్తరణకు స్పెషల్​ ఫోకస్ పెట్టాలన్నారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్​ శ్రీనివాస్ తదితరులుఉన్నారు.