- ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఈనెల 22లోగా
- 6, 7, 8వ తరగతులకు జూన్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలి
- మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల స్కూల్స్/కాలేజీలు
హైదరాబాద్: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6, 7, 8వ తరగులు మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు సూచించారు.
దరఖాస్తుల ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2022 - 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబర్లకు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి