పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో మంగళవారం ప్రజావాణికి మొత్తం1,947 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన తోటపల్లి సత్తయ్య శ్మశానవాటిక భూమిని ఆక్రమించారని, తిరిగి అప్పగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. 25 ఏండ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ చేస్తున్నామని తమను విద్యుత్ సంస్థల విలీనం చేయాలని కోరుతూ
రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. సొంత వాహనం కొనేందుకు షోరూమ్కు వెళ్తే .. ట్రాన్స్జెండర్ కావడంతో ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకురావడంలేదని ట్రాన్స్ జెండర్ సమంత ఫిర్యాదు చేసింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య పర్యవేక్షణలో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.