గడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయం

 గడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయం
  • దుకాణదారుడిపై వినియోగదారుల ఆగ్రహం

జీడిమెట్ల, వెలుగు: గడువు ముగిసిన కూల్​డ్రింక్స్​విక్రయించిన వ్యక్తిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రగతినగర్​వసంతనగర్ కాలనీ శ్రీ నిలయం కోఆపరేటివ్​సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనానికి తరలించారు.

 ఈ సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు దాదాపు 100 మంది ప్రగతినగర్ క్రిష్​మార్ట్​లో కూల్​డ్రింక్స్​ కొనుగోలు చేశారు. వాటిని తాగే క్రమంలో గడువు ముగిసిందని గుర్తించి, యజమానిని నిలదీశారు. దుకాణం లోపలికి వెళ్లి చూడగా అన్ని రకాల కూల్​డ్రింక్స్​గడువు ముగిసినవే ఉండటంతో అతనిపై మండిపడ్డారు. పోలీసులు, ఫుడ్​సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.