తొర్రూరు మున్సిపాలిటీలో విజయం సాధించాలి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు మున్సిపాలిటీలో విజయం సాధించాలి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరులో కాంగ్రెస్​ పార్టీ అన్నివార్డులను క్లిన్​స్విప్​ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరగా, ఝాన్సీరెడ్డి కాంగ్రెస్​ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు పట్టణంలోని క్యాంప్​ ఆఫీస్​లో 16 వార్డుల కాంగ్రెస్​ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు.