ముంబై: ఫ్రెంచ్ కంపెనీ పెర్నార్డ్ రికార్డ్ నాగ్పూర్లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. పారిశ్రామిక ప్రాంతంలోని బుటిబోరిలో దీనిని ఏర్పాటు చేస్తారు. ఇండియాలోని అతిపెద్ద డిస్టిలరీల్లో ఇదీ ఒకటి అవుతుంది. ఇందుకోసం రూ.1,796 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం పెర్నార్డ్ రికార్డ్ ఇండియా దేశవ్యాప్తంగా రైతుల నుంచి ప్రతి సంవత్సరం 50 వేల టన్నుల వరకు బార్లీని కొనుగోలు చేస్తుంది.
