- టెలిపోర్టు క్విజ్ నిర్వహిస్తున్న పీఎంఐ
- క్విజ్ విజేతలకు విమానంలో వెళ్లి ఐపీఎల్ చూసే అవకాశం కల్పించనున్న పీఎంఐ
న్యూఢిల్లీ: ఆన్లైన్లో గేమ్స్ ఆడే వారికి చిరపరిచితమైన పరిమ్యాచ్ పీఎంఐ సంస్థ రానున్న ఐపీఎల్ సెకండ్ సీజన్ కోసం టెలిపోర్ట్ క్విజ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్విజ్ పోటీని సక్సెస్ చేసేందుకు ఐదుగురు విజేతలకు విమానంలో యూఈఏ తీసుకెళ్లి ఐపీఎల్ మ్యాచులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పీఎంఐ సీఎంఓ దిమిత్రి బెలానిన్ మాట్లాడుతూ " టెలిపోర్ట్ క్విజ్ ద్వారా మా భారతీయ వినియోగదారుల చిరకాల కోరికను తీర్చాలనుకుంటున్నామన్నారు. క్విజ్ లో విజేతలకు తగిన గుర్తింపును పొందే అవకాశం మాత్రమే కాదు, విమానంలో యుఏఈ వెళ్లి అక్కడి ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు చూసే అవకాశం అందిస్తున్నామన్నారు. ప్రత్యక్షంగా అంతర్జాతీయ మ్యాచులు చూసి ఆస్వాదించాలనుకునే సామాన్యుల చిరకాల వాంఛను నెరవేర్చి వారికి గుర్తింపు కల్పించేందుకే ఈ టెలిపోర్టు క్విజ్ ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్విజ్లో పోటీలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాల కోసం www.teleport-in.com చూడవచ్చు