మెదక్ జిల్లాలో నేడు, రేపు (నవంబర్ 8, 9న) కరెంట్ సరఫరాలో అంతరాయం : ఏడీఈ మోహన్ బాబు

మెదక్ జిల్లాలో నేడు, రేపు (నవంబర్ 8, 9న) కరెంట్ సరఫరాలో అంతరాయం : ఏడీఈ మోహన్ బాబు

మెదక్, వెలుగు: మెదక్​ పట్టణం, మెదక్​, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శని, ఆదివారాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలుగుతుందని  విద్యుత్​ శాఖ మెదక్ ఏడీఈ మోహన్​ బాబు తెలిపారు.  

ప్రజలకు మరింత నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్​స్టేషన్ల​లో, విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ల మరమ్మతులు, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్​, కరెంట్​ తీగల మార్పులతో పాటు ట్రీ కటింగ్​ తదితర  పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 

దీంతో ఆయా ప్రాంతాల్లో  రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. ఈ విషయం గమనించి సహకరించాలని ప్రజలను కోరారు. 

శివ్వంపేటలో..

శివ్వంపేట:  శివ్వంపేటలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శభాష్ పల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ శివ్వంపేట్ సెక్షన్ ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు.