న్యూఢిల్లీ: గోవాలో అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనలో 25 మంది చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కాగా, గోవా మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు బాధితులను గవర్నర్ అశోక గజపతి రాజు పరామర్శించారు. అందరికీ మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై సీఎస్తోనూ మాట్లాడినట్లు చెప్పారు. మృతుల ఫ్యామిలీలకు పరిహారం ప్రకటించిన ప్రధానికి థ్యాంక్స్ తెలిపారు
