
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖనికి చెందిన సీనియర్లీడర్రాచకొండ కోటేశ్వర్లును నియమిస్తూ యూనియన్ఆల్ఇండియా సీనియర్ సెక్రటరీ బాబర్ సలీంపాష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా కోటేశ్వర్లు అందుకున్నారు. యూనియన్ బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.
బెంచీలు మంజూరు చేయాలని వినతి
ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం శిల్వాకోడూరు హైస్కూల్కు బెంచీలు మంజూరు చేయాలని విశాక ట్రస్ట్ మండల కో ఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ బుధవారం ట్రస్ట్ చైర్మన్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి త్వరలోనే బెంచీలు పంపిస్తామని హామీ ఇచ్చారు.