వోల్వో బస్సులో మంటలు.. మహిళ ప్రయాణికురాలు సజీవదహనం

వోల్వో  బస్సులో మంటలు.. మహిళ  ప్రయాణికురాలు సజీవదహనం

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచుపల్లి వద్ద వోల్వో  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. దీంతో  ఒక్కసారి మంటలు చెలరేగాయి.  బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.  ఓ మహిళా ప్రయాణికురాలు అందులోనే  సజీవ దహనమైంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కడప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

సజీవ దహనమైన మహిళ బస్సులో నుంచి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె చేయి సీటుకు ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయింది. దీంతో ఆమె సజీవ దహనమయింది. బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.  

 ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమన్య స్థానాలకు చేర్చారు.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.