
చందానగర్/మియాపూర్, వెలుగు: చందానగర్లోని సాయిబాబా, మియాపూర్లోని సంతోషిమాత ఆలయాల్లో వేర్వేరుగా చోరీ జరిగింది. చందానగర్లోని సాయిబాబా ఆలయంలో గురువారం అర్ధరాత్రి రెండు హుండీలు, మేనేజర్ టేబుల్లో నగదు చోరీకి గురయ్యాయి. అక్కడే పనిచేస్తున్న వాచ్మన్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్ లోని సంతోషిమాత సాయిబాబా ఆలయంలో హుండీలు మాయమయ్యాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది.