రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ సర్కార్ : షబ్బీర్ అలీ

రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ సర్కార్ :  షబ్బీర్ అలీ
  •   స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు పని చేయాలి
  •   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం గురువారం మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్​హాల్​లో జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పని చేసి, పూర్తిస్థాయి సీట్లు సాధించాలన్నారు. సన్నబియ్యంపై  బీజేపీ నాయకులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న  ఏ రాష్ర్టంలోనైనా  సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారా అని ప్రశ్నించారు.

 కష్టపడి పని చేసే కాంగ్రెస్​ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథన్ మాట్లాడుతూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అని విమర్శించారు.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందన్నారు.  

ఎంపీ సురేశ్​షెట్కార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే కాంగ్రెస్​ నాయకులు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.  డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు, అబ్జర్వర్లు కత్తి వెంకటస్వామి,  సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్​యాదవ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్​రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్​రెడ్డి, నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్​రెడ్డి, రమేశ్​గౌడ్​, నౌషిలాల్, భీమ్​రెడ్డి, సుతారి రమేశ్ పాల్గొన్నారు. 

ఆలయ కమిటీ పాలక వర్గం ప్రమాణస్వీకారం.. 

మాచారెడ్డి మండల కేంద్రంలోని శ్రీవీర హన్మాన్ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ పాలక వర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలకవర్గం చేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ ప్రమాణస్వీకారం చేయించారు. ఛైర్మన్​గా శెణిశెట్టి రాజమౌళి,  డైరెక్టర్లుగా ఎ.రాజేశం, భూక్యాశాంతి,  సత్యానారాయణ, దేవయ్య  ప్రమాణ స్వీకారం చేశారు