
- స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు పని చేయాలి
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం గురువారం మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పని చేసి, పూర్తిస్థాయి సీట్లు సాధించాలన్నారు. సన్నబియ్యంపై బీజేపీ నాయకులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ర్టంలోనైనా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారా అని ప్రశ్నించారు.
కష్టపడి పని చేసే కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథన్ మాట్లాడుతూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందన్నారు.
ఎంపీ సురేశ్షెట్కార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు, అబ్జర్వర్లు కత్తి వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్రెడ్డి, రమేశ్గౌడ్, నౌషిలాల్, భీమ్రెడ్డి, సుతారి రమేశ్ పాల్గొన్నారు.
ఆలయ కమిటీ పాలక వర్గం ప్రమాణస్వీకారం..
మాచారెడ్డి మండల కేంద్రంలోని శ్రీవీర హన్మాన్ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ పాలక వర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలకవర్గం చేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ప్రమాణస్వీకారం చేయించారు. ఛైర్మన్గా శెణిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా ఎ.రాజేశం, భూక్యాశాంతి, సత్యానారాయణ, దేవయ్య ప్రమాణ స్వీకారం చేశారు