ఉత్సాహంగా సౌతిండియా సైన్స్ ఫెయిర్

ఉత్సాహంగా సౌతిండియా సైన్స్ ఫెయిర్
  • నాలుగో రోజూ విద్యార్థులు, టీచర్ల సందడి

రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్​స్కూల్​లో నిర్వహిస్తోన్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్​ఉత్సాహంగా కొనసాగుతోంది. నాలుగో రోజు గురువారం సైన్స్​ ఫెయిర్​ను చూసేందుకు విద్యార్థులు, టీచర్లు భారీగా తరలిరాగా సందడి నెలకొంది. సంగారెడ్డి అడిషనల్​కలెక్టర్​ పాండు, ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్​ విద్యార్థుల ఎగ్జిబిట్లను పరిశీలించారు. స్పేస్​ఆన్​వీల్స్​వెహికల్ ఆకట్టుకుంది.

జన విజ్ఞాన వేదిక స్టాల్​ను ఏర్పాటు చేసి  మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు చేసే ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు.  విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్​లు దోహదం చేస్తాయని అడిషనల్​ కలెక్టర్​ పాండు పేర్కొన్నారు. భవిష్యత్​ప్రయోగాలకు బాటలు వేసే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.  శుక్రవారం ఫెయిర్​ ముగింపు వేడుకలు జరుగుతాయని తెలిపారు.