ఎండాకాలం నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నీటి కేటాయింపులు చేసింది. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించింది. మినిమమ్డ్రా లెవెల్తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే చెప్పింది.
రెండు రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో వాటర్ ఇప్పటికే డెడ్ స్టోరేజీ లెవెల్కు చేరుకున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 809.40 అడుగుల దగ్గర 33.957 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం లేదని త్రిసభ్య కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. నాగార్జున సాగర్లో 509.90 అడుగుల దగ్గర 131.499 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్లో మినిమమ్డ్రా లెవెల్ 505 అడుగుల నుంచి కూడా నీళ్లను తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సాగర్ నుంచి 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ మినిమమ్ డ్రా లెవెల్తో సంబంధం లేకుండా 500 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకునేందుకు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది.