టీచర్ల ఇండ్లలో స్టూడెంట్లతో పనులు

టీచర్ల ఇండ్లలో స్టూడెంట్లతో పనులు

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో పనిచేసే టీచర్లు స్టూడెంట్లను తమ ఇండ్లకు తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారని పీడీఎస్​యూ డివిజన్​కార్యదర్శి ఎం. శివప్రశాంత్​ఆరోపించారు. స్టూడెంట్లు టీచర్ల ఇండ్లలో పనిచేస్తున్న ఫొటోలను గురువారం మీడియాకు రిలీజ్ చేశారు. ఇటీవల గౌరారం ఆశ్రమ స్కూల్​లో ఈ తరహా ఘటన జరిగిందని చెప్పారు.

గురుకుల, ఆశ్రమ స్కూళ్లలోకి స్టూడెంట్ లీడర్లను అనుమతించొద్దంటున్న అధికారులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చదువు చెప్పాల్సిన టీచర్లు.. స్టూడెంట్లను క్యాంపస్​లోని తమ క్వార్టర్స్​కు తీసుకెళ్లి వెట్టి చాకిరి చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.