
సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలోని అల్పాహారం కోసం ఆగారు. సూర్యాపేటలోని సెవెన్ స్టార్ హోటల్ లో టిఫిన్ కోసం ఆగారు సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణ. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా జడ్జి బీఎస్. జగ్జివన్ కుమార్, రెండో మెట్రో పాలిటన్ న్యాయమూర్తి వసంత పాటిల్, ప్రిన్స్ పల్ జూనియర్ న్యాయమూర్తి కె. సురేష్ , అడిషనల్ జూనియర్ జడ్జి ప్రశాంతి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి , ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పలువురు స్వాగతం పలికారు.